ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రోగ్రాం కమిటి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆవుల చైతన్య

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ నిర్వహించే కార్యక్రమాలను సజావుగా నిర్వహించేందుకు ఆవుల చైతన్యను ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రోగ్రాం కమిటి ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఆవుల చైతన్య మాట్లాడుతూ… నా పైన నమ్మకం ఉంచి జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించిన పార్టీ అద్యక్షులు పవన్ కళ్యాణ్, ఆర్గనైజింగ్ కమిటీ స్టేట్ ప్రెసిడెంట్ కె శివ శ్రీనివాస్, చిత్తూరు జిల్లా పార్టీ అద్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ కార్యదర్శులు పగడాల మురళి, ఏకే శరవణ, పుంగనూరు నియోజకవర్గ నాయకులు పగడాల రమణ లకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలిపారు.