లైఫ్ డెమో ఫిల్మ్ హీరో అర్జున్ రెండవ చిత్రం ప్రారంభం

విశాఖపట్నం, కొట్టె మల్లికార్జున్ అర్జున్ ఇటీవల లైఫ్ డెమో ఫిల్మ్ తో హీరోగా పరిచయమయ్యారు. తన నటనతో హీరో అర్జున్ అందరిని ఆశ్చర్యపరుస్తూ, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడం జరిగింది. విశాఖపట్నంలోని సింహాచలం దేవస్థానం నందు తను హీరోగా చేయబోయే రెండవ చిత్రం స్క్రిప్ట్ పూజ కార్యక్రమం దేవస్థానంలోని వేద పండితుల మధ్య ఆలయ ఆవరణమునందు జరిగింది. వేద పండితులు చిత్ర బృందంను ఆశీర్వదిస్తూ ఈ సినిమాతో హీరో అర్జున్ మరియు దర్శకుడు సాయి శ్రీనివాస్ మణికంఠ, ఇతర నటీనటులకు ఎంతో మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం జరిగింది. హీరో అర్జున్ మాట్లాడుతూ… నూతనంగా చేయబోయే తన చిత్రాన్ని గతంలో తేజ దగ్గర రైటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సాయి శ్రీనివాస్ మణికంఠతో రెండవ చిత్రం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. సమాజంలో జరుగుతున్న అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని, సందేశాత్మక చిత్రంతోపాటు, ప్రేమతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ మరియు వాణిజ్య హంగులతో కూడిన చిత్రంను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ప్రస్తుతం మేము తీయబోయే చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పూజ కార్యక్రమం చేయడం జరిగింది. సరికొత్త కథతో మీ ముందుకు వస్తున్నాం. కచ్చితంగా ప్రేక్షకులు ఆదరించడంతోపాటు, ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు. నూతన దర్శకుడు సాయి శ్రీనివాస్ మణికంఠ మాట్లాడుతూ త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నాం. షూటింగ్ మొత్తం వైజాగ్ ప్రాంతం మరియు విశాఖ అరకు వ్యాలీ, వైజాగ్ లోని అన్ని రకాల బీచ్ తదితర పరిసర ప్రాంతాల్లో మొత్తం షూటింగ్ సింగిల్ షెడ్యూల్ లోనే కంప్లీట్ చేసుకుని, తొందరలోనే మీ ముందుకు వచ్చి తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మా మూవీకి సంబంధించి త్వరలోనే మూవీ టైటిల్ మరియు ఇతర నటీనటుల ఎంపిక, మరిన్ని వివరాలను త్వరలోనే మీడియా ముఖంగా వెల్లడిస్తాం. సింహాచలం దేవస్థానం సిబ్బందికి, వేద పండితులకు, అలాగే మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులకు, మిత్రులకు, అభిమానులకు, మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడంతో పాటు, కృతజ్ఞతలు తెలిపారు.