శ్రీరామ మందిర ప్రతిష్ట మహోత్సవ శుభాకాంక్షలు: డిఎంఆర్ శేఖర్

అమలాపురం: అయోధ్యలో శ్రీరాముని ఆలయం, విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలలో భాగంగా అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ పార్లమెంట్ ఇంచార్జ డిఎంఆర్ శేఖర్ మాట్లాడుతూ అందరికీ అయోధ్య శ్రీరామ మందిర ప్రతిష్ట మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మన దేశంలో రామాలయం లేని ఊరు లేదు. రాముని పూజించని ఇల్లు లేదు.. రామనామము జపించని నోరు లేదు.
అలాంటి దేశంలో రాములవారు ఇంటికి చేరుకోడానికి 500 సంవత్సరాలు పట్టిందన్నారు. నాడు రాములవారు తండ్రి మాట కోసం కూడా 14 సంవత్సరాలే వనవాసం. కానీ మా వల్ల 500 సం.రాల తరువాత సత్యం ధర్మంతో న్యాయబద్ధంగా నీ ఇంటికి నువ్వు వెళ్తున్నావయ్యా రామయ్యా అని హాజరైన భక్తులతో తన భావాలను శేఖర్ పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి జనసేన అమలాపురం పార్లమెంట్ ఇంచార్జ్ డిఎంఆర్ శేఖర్, మాజీ అమలాపురం మున్సిపల్ చైర్మన్ సతీష్, జనసేన అమలాపురం పార్లమెంట్ గౌరవ అధ్యక్షులు నల్లా శ్రీధర్ అమలాపురం రూరల్ మండల అధ్యక్షుడు లింగోల పండు, చల్లపల్లి ప్రెసిడెంట్ ఇసుకపట్ల రఘుబాబు, అయితబత్తుల ఉమామహేశ్వర రావు, మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.