ఆజాద్ వార్తా పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన పితాని

ముమ్మిడివరం: ఆజాద్ తెలుగు సంచలన వార్తా పక్ష పత్రిక క్యాలెండర్ ను శుక్రవారం రాష్ట్ర జనసేనపార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ పత్రిక యొక్క యాజమాన్యం వారు అయిన పితాని సూర్య ప్రసాద్ గారికి అభినందనలు తెలియజేసి, దినదిన అభివృధి చెందాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), పితాని రాజు, గొలకోటి సాయిబాబు, పెన్నాడ శివ, కడలి నాగేశ్వరరావు మొదలగువారు పాల్గొన్నారు.