బి.కొత్తకోట జనసేన పార్టీ మండలాధ్యక్షుడుగా ఎస్ రామానుజులు

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజవర్గం, బి.కొత్తకోట మండల జనసేన పార్టీ అధ్యక్షుడు నియమించబడ్డ ఎస్ రామానుజులు ఎన్నుకోవటం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రామాంజి, జిల్లా జాయింట్ సెక్రెటరీ బండి వెంకటేశ్వర్లు మరియు జనసైనికుల ఆధ్వర్యంలో సన్మానించడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నాకు ఈ పదవి అప్పగించిన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ కి, అలాగే జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ జిల్లా జాయింట్ సెక్రెటరీలు బండి వెంకటేశ్వర్లు, షాకీర్ భాష, గజ్జల రెడ్డప్ప లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి పల్లెకు జనసేన పార్టీ సిద్ధాంతాలు అలాగే ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లి జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేసి తంబళ్లపల్లె నియోజకవర్గంలో రాబోవు ఎన్నికలలో జనసేన పార్టీ జెండా ఎగురవేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సయ్యద్, చందు, చిరంజీవి, చిన్న, అమర, మునిరాజ్, నాగ రమణ, ఖలీల్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.