వృద్ధాశ్రమం నందు పండ్లు, అల్పాహారం పంపిణీ చేసిన ఎమ్మిగనూర్ జనసేన

జనసేన పార్టీ ఎమ్మిగనూర్ నియోజకవర్గ ఇంచార్జ్ రేఖ గౌడ్, జన్మదిన వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు స్థానిక వేదాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వృద్ధాశ్రమం నందు 30 మందికి పండ్లు, అల్పాహారం, పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, చేనేత వికాస్ రాష్ట్ర కార్యదర్శి కాసా రవిప్రకాష్ లు మాట్లాడుతూ సేవచేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని దీన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుంటూ తన శక్తి మేర సమాజానికి ఉపయోగపడే విధంగా ఎంతోకొంత సేవలు చేయాలని, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరపున ప్రజలకు ఉపయోగపడే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కర్ణం రవి, గాజుల వెంకటేష్, షబ్బీర్, వినయ్, రషీద్, తదితరులు పాల్గొన్నారు.