మడికి శివారు మళ్ళావానితోట గ్రామంలో పలువురిని పరామర్శించిన బండారు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం ఇంచార్జ్ ప్రముఖ జనసేన పార్టీ రథసారధి బండారు శ్రీనివాస్ బుధవారం ఆలమూరు మండలంలో మళ్ళావానితోట గ్రామం నందు ఈ సందర్భంగా పలువురు ఆనారోగ్య కారణాల వల్ల విశ్రాంతి తీసుకుంటున్న పలువురుని పరామర్శించి ఉన్నారు. ఈ కార్యక్రమంలో మొదటిగా పరామర్శించిన వారిలో గత కొద్దిరోజుల నుండి కిడ్నీ బాధ కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న ముషీని ప్రభావతిని మరియు యానామాదల సత్తిబాబుని పరామర్శ చేసి, మళ్ళావానితోట గ్రామం వచ్చి వారి ఇంటి యందు కలిసి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నేత బండారు శ్రీనివాస్ వెంట, ఆలమూరు మండల కొత్తపల్లి నగేష్, పంపన సురేష్, చెల్లుబోయిన మణికంట, వాసంశెట్టి శ్రీనివాస్, పంపన సూరిబాబు, సూరంపూడి నాగరాజు, టేకు మోడీ శంకరం, రెడ్డి శ్రీనివాస్, యనమదల వీరబాబు, అనుసూరి ప్రసాద్, కొప్పి శెట్టి దుర్గారావు, షేక్ లాల్ భాష, కంప శెట్టి వెంకన్న, దాసరి దుర్గాప్రసాద్, కొప్పిశెట్టి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.