తనుకువాడ మరియు సలపాక గ్రామాల్లో పర్యటించిన పోలిశెట్టి చంద్రశేఖర్

  • తనుకువాడలో జనసేనలో చేరికలు

రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు కాజులూరు మండల అధ్యక్షులు బోండా వెంకన్న ఆధ్వర్యంలో గొల్లపాలెం ధనమ్మతల్లి అమ్మవారిని దర్శించుకొని తనుకువాడ గ్రామంలో పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో తనుకువాడ గ్రామంలో జనసేన పార్టీలో జనసేన పార్టీ సిద్ధంతాలు నచ్చి పలువురు జనసేనలో చేరడం జరిగింది. అనంతరం సలపాక గ్రామంలో ఇంటింటికి పర్యటించడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్దాంతాలు రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గం జనసేన నాయకులు జనసైనికులు పాల్గొనడం జరిగింది.