సుంకర భూషణం కుటుంబాన్ని పరామర్శించిన బత్తుల బలరామకృష్ణ

రాజానగరం నియోజకవర్గం, భూపాలపట్నం గ్రామంలో సుంకర భూషణం కాన్సర్ కారణంగా ఇటీవల కాలంలో స్వర్గస్తులైనారు‌. వారి ఇద్దరి కుమారులు శ్రీను మరియు గోవింద్ ని కలిసి, పరామర్శించి.. ధైర్యం చెప్పిన రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ. అనంతరం జనసేన శ్రేణుల చేతుల మీదుగా 10,000 ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బుల్లింకల లోవరాజు, భూపాలపట్నం గ్రామ సర్పంచ్ మద్దిరెడ్డి బాబు, శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరామ్, నాతిపాము దొర, భూపాలపట్నం గ్రామ ప్రజలు మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.