షారోను ప్రార్ధన మందిరంలో క్రైస్తవ కూటమి ప్రార్ధనల్లో పాల్గొన్న బత్తుల దంపతులు

రాజానగరం నియోజకవర్గం, దివాన్ చెరువు గ్రామం నందు షారోను ప్రార్ధన మందిరంలో క్రైస్తవ కూటమి కార్యక్రమంలో దివాన్ చెరువు క్రిస్టియన్ పెద్దల ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గ జనసేన నేత బత్తుల బలరామకృష్ణ, వారి సతీమణి శ్రీమతి వెంకటలక్ష్మి. పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న ‘బత్తుల’ దంపతులకు ఈ సందర్భంగా చిరు సత్కారం అందజేశారు. నూతనంగా నిర్మిస్తున్న ప్రార్థనా మందిరం అభివృద్ధి నిమిత్తం ₹10,000/- రూపాయలు ఆర్థిక సహాయం సంఘ పెద్దలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత యర్రంశెట్టి శ్రీనివాస్, అక్కిరెడ్డి వేణు, బొడ్డపాటి నాగేశ్వరరావు, బొంగా స్టాలిన్, రాయి చిట్టిబాబు, చాపల సుబ్బు, చాపల లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.