నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి బత్తుల లక్ష విరాళం

రాజానగరం, కోరుకొండ మండలం శ్రీ లక్ష్మి నరసింహ గాయత్రీ బ్రాహ్మణ సమాఖ్య నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు లక్ష రూపాయలు చెక్ అందించిన బత్తుల. సోమవారం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా అర్చకులు ఆశీర్వచనాలు అందించి అనంతరం శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కోరుకొండ మండలంలో నూతనంగా నిర్మిస్తున్న బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు ₹1,00,000/- చెక్ ను శ్రీ లక్ష్మి నరసింహ గాయత్రీ బ్రాహ్మణ సమాఖ్య మండల ప్రెసిడెంట్ కొత్తపల్లి భాస్కర రాముకి బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు అందజేయడాం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరితో పాటు బ్రాహ్మణ సమాఖ్య ట్రెజరర్ పి.గిరిధర్, వైస్ ప్రెసిడెంట్ పి. నరసింహామూర్తి, సెక్రటరీ రేగడమిల్లి ప్రవీణ్ కుమార్, రాజానగరం నియోజకవర్గం అఖిలపక్షం అధ్యక్షులు అడపా శ్రీనివాస్, పి.సత్తిరాజు తదితరులు పాల్గొన్నారు.