డా.ద్వారకనాద్ కు ఘన నివాళులు

ఉమ్మడి కడపజిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని సిద్దవటంలో డా.ద్వారకనాద్ కు ఘనంగా నివాళులర్పించారు. జనసేనపార్టీ నాయకులు విద్యాసంస్థల అధినేత, మాజీ మండల అధ్యక్షులు స్వర్గీయ బండారు గోపాలస్వామి పెద్ద కుమారుడు డాక్టర్ బండారు ద్వారకనాధ్ (50) సిద్దవటంలో కౌలు రైతు భరోసా సభ జరపడానికి స్థలం ఇచ్చిన వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారని విషయం తెలుసుకుని జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ అక్కడికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా స్థానిక జనసేనపార్టీ నాయకులు, జనసైనికులు, గ్రామస్థులతో కలిసి అంత్యక్రియలలో పాల్గొని ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్ధించడం జరిగింది.