నీరుకొండ అన్నపూర్ణకు నివాళులు అర్పించిన బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం నియోజకవర్గం: సీతానగరం మండలం, వంగలపూడి గ్రామానికి చెందిన నీరుకొండ అన్నపూర్ణ ఇటీవల స్వర్గస్తులయ్యారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి బుధవారం వారి ఇంటికి వెళ్లి నీరుకొండ అన్నపూర్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట జనసేన పార్టీ నాయకులు మట్ట వెంకటేశ్వరావు, నాగారపు సత్తిబాబు, వీరమహిళ గోకాడ సూర్యావతి, మద్దాల యేసు పాదం, చీకట్ల వీర్రాజు, వణువు లక్ష్మి, పిండి వివేక్, వేగిశెట్టి రాజు, దేనిడి మణికంఠ స్వామి (డి.ఎం. ఎస్), తోట అనీల్ వాసు, సంగుల రమేష్, దేవన దుర్గా ప్రసాద్ (డిడి), సుంకర బాబ్జి మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.