మహబూబ్ సుభాని సంబరంలో పాల్గొన్న బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం: ముస్లిం సోదరులు సంవత్సరానికి ఒకసారి అత్యంత పవిత్రంగా జరుపుకునే….”మహబూబ్ సుభాని సంబరం” (గుర్రాల పండుగ) తీర్థం సీతానగరం మండలం, ఇనుగంటివారిపేట గ్రామంలో అత్యంత వైభవంగా జరిగింది.. గ్రామంలోని ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు సంబరంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి… అక్కడ ఉన్నటువంటి దర్గాను సందర్శించి, సంతోషం వ్యక్తం చేస్తూ…. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచేటట్టు కార్యక్రమం ఉందని, అల్లా ఆశీస్సులు అందరికీ దక్కాలని కోరుతూ…. ఈ సందర్భంగా వారితో మమేకమవుతూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ.. ఈ వారికి బత్తుల వెంకటలక్ష్మి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. కార్యక్రమంలో సీనియర్ నాయకులు మట్ట వెంకటేశ్వరరావు, మద్దిరెడ్డి బాబులు, బోయిడి వెంకటేష్గా, రఫీ రబ్బాని, సుభాని జిన్నా, ప్రసాద్, మహబూబ్ వల్లి, భాషా, జబ్బారా, రంగళి అభిరామ్, నాయుడు, తోట అనిల్ వాసు, పెంటపాటి శివ, పిండి వివేక్ ఇతరులు పాల్గొని పాల్గొన్నారు.