శ్రీ స్కంద గణపతి విగ్రహ ప్రతిష్ట వేడుకలో పాల్గొన్న బత్తుల

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామంలో శ్రీ స్కంద గణపతి విగ్రహ ప్రతిష్టకు గ్రామస్తుల ప్రత్యేక ఆహ్వానం మేరకు విగ్రహ ప్రతిష్ట వేడుకలో పాల్గొని శ్రీ స్కంద గణపతిని రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి దంపతులు దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి వెంట జిల్లా జనసేన పార్టీ నాయకులు, నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, కోరుకొండ మండల జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు శ్రీరంగపట్నం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.