భారీ అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల

రాజానగరం, కోరుకొండ మండలం, బూరుగుపూడి గ్రామంలో దుర్గామాత ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు ఘనంగా జరిగిన భారీ అన్నసమారాధన కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పాల్గొని అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.