పీతల శ్రీనివాస్ కుటుంబానికి ఇరవై వేల ఆర్ధికసాయం చేసిన బత్తుల

రాజానగరం మండలం, నందరాడ గ్రామంలోని జనసేన పార్టీకి ముందు నుంచి సేవలందిస్తున్న పీతల శ్రీనివాస్ ఇటీవల కాలంలో ఆక్సిడెంట్ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం జనసైనికుల చేతుల మీదుగా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.