హక్కుల కోసం బెంతు ఒరియాల పోరాటం

ఇచ్చాపురం: కవిటిలో తమ హక్కులకోసం పోరాటం చేస్తున్న బెంతు ఒరియాల 15వ రోజు రిలే నిరాహారదీక్షలో పాల్గొన్న డి గొనపపుట్టుగా పంచాయితీ పెద్దజల్లుపుట్టుగ గ్రామ పెద్దలు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జల్లుపుట్టుగా ప్రతినిధులు మాట్లాడుతూ ఎక్కడో సంత బొమ్మాళిలో జరిగిన తప్పిదం కారణంగా మా బెంతు ఒరియా సామాజిక వర్గం యొక్క కుల ధృవీకరణ పత్రాలు అకారణంగా నిలిపి వేయుట తీవ్ర అన్యాయం అని ప్రశ్నించారు. తమ పిల్లల విద్య, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు అని చింతామణి, జైరామ్, ప్రభ, చక్రపాణి ప్రశ్నించారు. శ్రీధర్ సహు, యూత్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ జయసేన్ బిసాయి, దుదిస్టి మజ్జి, బృందావన్ బిసాయి, కృష్ణ దళాయి, గోపి బిసాయి తదితరులు పాల్గొన్నారు.