పాలకొండ జనసేన ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి

పాలకొండ, “భగత్ సింగ్” 115వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ, పాలకొండ నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో పాలకొండ నియోజకవర్గం జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం కోసం నిస్వార్ధంగా ప్రాణాలను అర్పించిన వ్యక్తి భగత్ సింగ్ అని, దేశంలో యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను ఆచరణలోకి తీసుకోవాలని ఆయన అన్నారు. ఆయనతో పాటుగా కొందరు జనసైనుకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సతివాడ వెంకటరమణ, ఆశపు విశ్వనాథ, గర్భాపు నరేంద్ర, పెనుగొండ శేకర్, డంపాక సాయి కుమార్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.