కడప జనసేన ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి మహా నిరసన

కడప జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కడప ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ దగ్గర నల్ల బ్యాడ్జీలు ధరించి మహా నిరసన కార్యక్రమం చేపట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రెక్కీ నిర్వహించి హత్య చేయడానికి గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస సంఘటనలు హత్య ప్రయత్నాలపై ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తు కేంద్ర నిఘవర్గాలు పవన్ కళ్యాణ్ హత్యకు 250 కోట్లు సుపారి డీల్ జరిగిందని ఆయనను చంపడానికి గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు జరిగాయని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టి పట్టనట్టు మొద్దునిద్ర నిద్రపోతుందని ఒకవేళ పవన్ కళ్యాణ్ కి ఏమైనా జరిగితే రాష్ట్రం అల్లకల్లోలం, అతలాకుతలం అవుతుందని మీరు ఎవరూ కూడా రోడ్లపై తిరగలేరు అన్న విషయం గుర్తు పెట్టుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తక్షణమే ఈ కుట్రలో భాగస్వాములు ఎవరో ఈ కుట్ర వెనుక ఎవరెవరు ఉన్నారో విచారణ చేపట్టాలని, దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అటు తెలంగాణ ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు కూడా పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కూడా తక్షణమే పవన్ కళ్యాణ్ కి జెడ్ ప్లస్ భద్రత ఏర్పాటు చేయాలని కడప జిల్లా జనసేన పార్టీ ద్వారా డిమాండ్ చేశారు. అసలు ఈ సుపారి డీల్ వెనుక హత్యాయత్నం కుట్ర వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. అందుకు వరుసగా జరుగుతున్న సంఘటనలే నిదర్శనమని, అటువంటి ప్రయత్నాలు ఏవైనా వైసిపి పెద్దలు చేస్తూ ఉంటే వెంటనే మానుకోవాలని లేదా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి జనసైనికులు మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యక్రమాల కమిటీ కార్యదర్శి సురేష్ బాబు, కడప జిల్లా జనసేన నాయకులు పండ్రా రంజిత్ కుమార్, పత్తి విశ్వనాథ్, బోరెడ్డి నాగేంద్ర, చిన్న, నాగరాజు, కుమార్ నాయక్, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.