ఘనంగా కశింకోట జనసైనికుడు గణేష్ పుట్టినరోజు వేడుకలు

అనకాపల్లి నియోజకవర్గం, కశింకోట మండలం ఉగ్గినపాలెం గ్రామ జనసైనికుడు, క్రియాశీలక సభ్యుడు మండలంలో పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా ఉండే కలగ గణేష్ జన్మదిన వేడుకలు మండల జనసైనికుల ఆధ్వర్యంలో స్వగ్రామం ఉగ్గినపాలెంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ మండలం నుండి ఇంతమంది అభిమానంతో విచ్చేసి, జన్మదిన శుభాకాంక్షలు అందించడం తనకెంతో ఆనందాన్నిచ్చిన విషయమని, ప్రతి జనసైనికుడు పార్టీని గ్రామస్థాయిలో బలపరిచి రానున్న ఎన్నికలలో జనసేన జెండా రెపరెపలాడేలా చూడాలని తద్వారా అనకాపల్లి ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావుని 2024 అనకాపల్లి ఎమ్మెల్యేగా చూడాలని ఆశిస్తున్నానని, తనకి ఇంతచక్కని వసుదైక కుటుంబాన్ని ఇచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ కి జన్మజన్మలా ఋణపడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గొంతిన ఈశ్వరరావు, కర్రి గోవింద్(పిఆర్ పి గోవింద్), కలగా శ్రీనివాసరావు, కాయల బాబురావు, కలిగెట్ల వీర, గూడెపు మణికంఠ, అఖిల్ శ్రీను, కర్రి లోవరాజు, తోరం గణేష్, కర్రి సత్తిబాబు, మండపాక రామ త్రినాధ్, జోగాడ సతీష్, గుర్రాల సత్యారావు, కడిమి శ్రీను, గెంజి హేమంత్, పడాల యస్వంత్, కరణం శివ కుమార్, కడిమి నాగ చిరంజీవి, మజ్జి బాబ్జి తదితరులు, జనసేన ఎంపీటీసీ అభ్యర్థి కలగా నాగ భూషన్ మరియు గ్రామ జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.