గుమడం పంచాయతీలో జనసేన నాయకుల పర్యటన

ఎచ్చర్ల నియోజకవర్గం, లావేరు మండలం, గుమడం పంచాయతీ, ఎస్. సి కాలనీలో ఆదివారం ఎచ్చెర్లనియోజకవర్గ జనసేన టీం పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమసమస్యలను జనసేన నాయకులకు తెలియజేసారు.
ప్రధానంగా డ్రైనేజీ సమస్య, మంచి నీటి సమస్య, సి. సి రోడ్ సమస్య, ఇంటిబిల్లులు సమస్య, అర్హతవున్నవారికి ఇల్లు ఇవ్వకపోవటం మొదలైన సమస్యలను వివరించారు. ఈ సమస్యలపై జనసేన ఎచ్చెర్ల టీం పరిస్కార దిశగా పోరాటం చేస్తుందని మీడియా సమక్షములో చెప్పడము జరిగింది. ఈ కార్యక్రమములో జనసేన టీం భూపతి అర్జున్, ధన్నానచిరంజీవి, బొంతువిజయకృష్ణ, సువ్వాదరామారావు, రాంబాబు, సాయి, చిన్నా, చలపతిరావు, పైడిరాజు, రమేష్. కాలనీ ప్రజలు పాల్గొన్నారు.