పలు కుటుంబాలను పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జి పితాని బాలకృష్ణ ఐ పోలవరం మండలం, ఐ పోలవరం గ్రామంలో శనివారం ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో మరణించిన దంగుడు బియ్యం తాతయ్య (35) కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా ఐ పోలవరం మండలం, కేసునుకూరు గ్రామంలో ఇటీవల అకాల మరణం చెందిన పెమ్మిరెడ్డి నాగేంద్ర కుమారి (పెమ్మిరెడ్డి కోటేశ్వరరావు వదిన) కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరి వెంట మండల అధ్యక్షులు మద్దెంశెట్టి పురుషోత్తం, దేవి రాంబాబు, తాత కాపు, ఎంపిటిసి లంకనపల్లి జమ్మి, ఇండుగుల రామకృష్ణ, దూడల స్వామి, లంకనపల్లి వెంకటేశ్వరరావు, పితాని రాజు, పడాల లక్ష్మణు, గుత్తుల శ్రీను, చిక్కాల లక్ష్మణ్, పడాల త్రిమూర్తులు, గంగా బత్తుల రాంబాబు, మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.