అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి అండగా బొలిశెట్టి

తాడేపల్లిగూడెం నియోజకవర్గం, తాడేపల్లిగూడెం రూరల్ మండలం, పుల్లయ్య గూడెం గ్రామంలో పెద మూర్తి ముసలయ్య ఇల్లు గ్యాస్ బండ పేలి దగ్ధమైంది. సంఘటన తెలిసిన వెంటనే తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు నెలకు సరిపడా నిత్యవసర సరుకులు, వస్త్రాలు, దుప్పట్లు, పదివేల రూపాయలు సహాయం అందజేసి ప్రభుత్వం వెంటనే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, అడ్డగర్ల సూరి, పుల్లయ్య గూడెం ఆకుల శ్రీను, బద్దిరెడ్డి వాసు, గంగాధర్, పండు మరియు జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.