జాతీయ సైక్లింగ్ పోటీలకు గణేష్ ఎంపిక

విజయనగరం: 28వ సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలకు విజయనగరం జిల్లా, గంట్యాడ మండలం, ఆర్.వసంత గ్రామానికి చెందిన దమరసింగ్ గణేష్ ఎంపికైనారు. ఈనెల 9వ తేదీ నుఒడి 12 తేదీ వరకు కర్ణాటక రాష్ట్రం విజయపూర్ లో ఈ పోటీలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ సైక్లింగ్ టీమ్ తరుపున గణేష్ ఈ పోటీల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా గణేష్ కు విజయనగరం జిల్లా జనసేన నేత, ఒలింపిక్ అధ్యక్షలు గురాన అయ్యలు, కార్యదర్శి సిహెచ్ వేణుగోపాలరావు, జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.ఎస్.ఎన్ రాజు, సపక్ తక్రా కార్యదర్శి రాజేష్ అభినందనలు తెలిపారు. ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు.