జనంలోకి జనసేన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బొమ్మిడి నాయకర్

నరసాపురం నియోజకవర్గం, గొంది గ్రామంలో నరసాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ జనంలోకి జనసేన కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు కోటికలపూడి చినబాబు, రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి, ఉంగుటూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జి పత్సమట్ల ధర్మరాజు, ఉండి నియోజకవర్గ ఇంఛార్జి జిత్తుగ నాగరాజు, తణుకు నియోజకవర్గ ఇంచార్జి విడివాడ రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జి, ఆకన చంద్రశేఖర్, కోటిపల్లి వెంకటేశ్వరరావు, వలవల నాని, కొల్లాటి గోపీకృష్ణ, వాతాడి కనకరాజు, బందెల రవీంద్ర, గంటా కృష్ణ, గుబ్బల మార్రాజు, మోకా శ్రీను, యర్రంశెట్టి శ్రీనివాసు, పెదపాటి సత్యనారాయణ, కొల్లాటి ఏసురత్నం మరియు నియోజకవర్గ, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కౌన్సిలర్ లు, నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు మరియు గొంది గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.