నకరికల్లు మండల పరిధిలో పర్యటించిన బొర్రా వెంకట్ అప్పారావు

  • నకరికల్లు మండల వైస్ ప్రెసిడెంట్ షేక్ రఫీ ఆహ్వానం మేరకు తేనేటి విందుకు హాజరు
  • పర్యటనలో భాగంగా పలువురికి ఆర్థిక సాయం
  • కార్యకర్తలకు ఎటువంటి ఆపద వచ్చినా ముందుంటా

సత్తెనపల్లి నియోజకవర్గం: మండల కేంద్రమైన నకరికల్లులో మరియు నకరికల్లు అడ్డరోడ్డు, గుండ్లపల్లి నకరికల్లు గ్రామాలలో సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు పర్యటించారు. పర్యటనలో భాగంగా లక్ష్మీ నరసింహ స్వామి కమిటీ సభ్యులకు అన్నదాన కార్యక్రమ నిమిత్తం 25 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించినారు. అదేవిధంగా గత కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న నకరికల్లు బంగ్లా గడ్డ జనసేన కార్యకర్త షేక్ నాగుల్ మీరాకి ఆపరేషన్ ఖర్చుల కొరకు ఆర్థిక సహాయం అందిస్తానని మాటిచ్చారు, అదేవిధంగా గుండ్లపల్లి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త సొప్పర్ల శ్రీనివాసరావు కు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ సత్తెనపల్లి నియోజకవర్గంలో జనసేన నాయకులకు, కార్యకర్తలకు ఎటువంటి ఆపద వచ్చినా ముందుంటానని ఆయన అన్నారు. కార్యక్రమంలో బాఘంగా జనసేన పార్టీ నకరికల్లు మండల వైస్ ప్రెసిడెంట్ షేక్ రఫీ పిలుపుమేరకు ఆయన గృహంలో తేనేటి విందు స్వీకరించడం జరిగిందని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుందని ప్రతి ఒక్క కార్యకర్త పవన్ కోసం కష్టపడాలని నియోజవర్గంలో ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా సరే నేను మీ అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, నకరికల్లు మండల వైస్ ప్రెసిడెంట్ షేక్ రఫీ, సయ్యద్ నాగుర్ వలి తెలిపారు. ముప్పాళ్ళ మండల అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్, సత్తెనపల్లి రూరల్ మండలం అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, సత్తెనపల్లి జనసేన పార్టీ వీర మహిళ పుష్ప నామాల, అమ్మిశెట్టి శిరీష, నకరికల్లు జనసేన పార్టీ నాయకులు కాసా రామకృష్ణ, మొగిలి నరసింహ, బండి వర్ధన్, రుసుం రామయ్య, డికొండ లక్ష్మీనారాయణ, కాయల శివయ్య, తదితరులు పాల్గొన్నారు.