కరీం జానీని పరామర్శించిన బొర్రా

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణంలోని 23వ వార్డులో ఉన్నటువంటి కరీం జానీని సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు పరామర్శించడం జరిగింది. బైపాస్ సర్జరీ చేయించుకుని బాధపడుతున్నటువంటి కరీం జానీ ఇంటికి వెళ్లి వ్యక్తిని పరామర్శించి, వారి యొక్క ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవడం జరిగినది, కరీంజానీ కుటుంబ సభ్యులకు భరోసానివ్వడం జరిగినది. జనసేన పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి ఏడవ వార్డు కౌన్సిలర్ రంగశెట్టి సుమన్, సత్తనపల్లి మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, గట్టు శ్రీదేవి, చిలకాపూర్ణ, రాము, తిలక్, షేక్ ఇమామ్, షేక్ అహ్మద్ తదితరులు ఉన్నారు.