గుంతకల్ జనసేన ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ

గుంతకల్, జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ సేవ స్ఫూర్తితో అనంత జనసేనాని టి.సి వరుణ్ జన్మదినం సందర్భంగా అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ చేతుల మీద శనివారం ఉదయం గుంతకల్ పట్టణం రైల్వే స్టేషన్, మేరీ మాత చర్చ్ రోడ్డు నందు యాచకులకు అల్పాహార పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రజలకు చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకొని వేసవికాలం సందర్భంగా అనాధ యాచకులకు అల్పాహారం మరియు మంచినీరు ప్యాకెట్లు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంతకల్ పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్, జిల్లా కార్యక్రమాల నిర్మాణ కమిటీ సభ్యులు పవన్ శేఖర్, ఎస్. కృష్ణ, గుంతకల్ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్, ఆటో రామకృష్ణ, శ్రీనివాసులు, అమర్, మంజునాథ్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.