డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం పట్టణం, ఉప్పాడ జంక్షన్ నందు పిఠాపురం నియోజకవర్గం మరియు పరిసర ప్రాంత ప్రజలు వేలాదిగా తరలివచ్చిన భక్తులకు 1000 లీటర్ల పెరుగుతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పల్నాటి మధుబాబు, గంజి సురేష్, మైన బత్తుల చిన్న, పిట్ట చిన్న, రాష్ట్ర మత్స్కర నాయకులు కంబాల దాసు, మత్స్కార నాయకులు పల్లేటూరు బాపన్న దొర, పిల్ల శ్రీను, బొజ్జ గోపికృష్ణ, బొజ్జ ఐరాజు, బిజెపి నాయకులు పిల్లా ముత్యాలరావు, ఆకుల యేసు, కంద చక్ర బాబు జీలకర్ర సత్తిబాబు, వాకపల్లి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.