టెట్ నిర్వణలో సిరిసిల్ల అధికారుల నిర్లక్ష్యం

టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ పరీక్ష నిర్వణలో సిరిసిల్ల అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించారని గ్రేటర్ హైదరాబాద్ జనసేన విద్యార్థి విభాగ అధ్యక్షులు మహేష్ పెంటల పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒక పరీక్ష కేంద్రానికి వెళ్లాల్సిన పేపర్ మరొక కేంద్రానికి, తీరా ప్రారంభం అయిన 30 నిమిషాల తరువాత వైట్నర్ తో దిద్దుబాటు చర్యలు చేసారు. ఈ కారణంగా అభ్యర్థుల విలువైన సమయం వృధా అయ్యింది. మంత్రిగారి ప్రోగ్రాం మీద ఉన్న శ్రద్ధ వేల మంది నిరుద్యోగుల భవిష్యత్ పై లేదా.. నిర్లక్షయంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మహేష్ పెంటల డిమాండ్ చేశారు.