సిజి రాజశేఖర్ కుటుంబం పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి

పత్తికొండ నియోజకవర్గం నాయకుడు సిజి రాజశేఖర్ కుటుంబం పై గుర్తుతెలియని వ్యక్తులు భయాందోళనకు గురి చేశారు. జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు రాజశేఖర్ మాట్లాడుతూ సోమవారం రాత్రి 11 గంటల 10 నిమిషాలకు మా ఇంటి పైకి గుర్తు తెలియని దుండగులు రావడం జరిగింది. వచ్చిన వారిని కుటుంబ సభ్యులు గుర్తించడంతో రాజశేఖర్ వారి కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో వారు పారిపోయారు. తర్వాత వెంటనే సోమవారం రాత్రి పత్తికొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్ కి ఫోన్ చేయడం కూడా జరిగింది. ఫోన్ చేసిన వెంటనే మా ఇంటికి భద్రత సిబ్బందిని కూడా పంపించారు. పోలీసు వారి సహాయంతో ఎలా పైకి వచ్చారని అడగడంతో ఎలా వచ్చారో పోలీసులకు కూడా వివరించడం జరిగింది దుండగులు మా ఇంటి పైకి ఎక్కేటప్పుడు మేము కేకలు వేయడంతో మా ఇంటి పైనుంచి కిందకు దూకినప్పుడు వారి చెప్పులు కింద పడిపోయాయి వాటిని పోలీసులు కూడా చూశారు. ఇది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదని తెలియజేశారు. అదేవిధంగా ఒకవేళ రాజకీయ కుట్ర అయితే కుటుంబ సభ్యులను భయ ప్రాంతాలకు చేయడం కరెక్టు కాదని చేతనైతే ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో తప్పొప్పులు తేల్చుకోవాలని తెలియజేశారు. రాతపూర్వకంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి మంగళవారం వెళ్దాం అనుకున్నాం కాకపోతే ఈరోజు సిఐ కర్నూల్ ఎస్పీ ఆఫీస్ కి వెళ్లడం వల్ల బుధవారం ఉదయం 10 గంటలకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అని సిజి రాజశేఖర్ తెలిపారు.