శ్రీరాం నగర్ లో స్కాముపై చైతన్య యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో స్కాముపై చైతన్యం కార్యక్రమం నిమ్మకాయల కిరణ్ ఆధ్వర్యంలో శనివారం శ్రీరాం నగర్ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. ఈ సంధర్భంగా జనసేన శ్రేణులు మాట్లాడుతూ జనసేన పార్టీ పి.ఏ.సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ బట్టబయలు చేస్తున్న ప్రభుత్వ అవినీతిలను తాము నాదెండ్లగారు మాట కాకినాడలో అందరినోట అనే నినాదంతో ప్రతిరోజూ చైతన్య యాత్రని చేస్తున్నామన్నారు. ఈ వై.సి.పి ప్రభుత్వం చేసిన గేదెల కొనుగోలు అవినీతిని స్థానిక ప్రజలకు వివరించారు. ఈ వై.సి.పి ప్రభుత్వం పేదలకు పంచిపెడుతున్నామని దీనిద్వారా పేదలకు సంపాదన వచ్చి తద్వారా మెరుగైన జీవితాన్ని పొందుతారని చెపుతూ వారి పేరుతో కొన్ని వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్నారు. ఇది కొత్తగా తెరపైకి వచ్చిన అవినీతి కుంభకోణాలనీ, దీనికి ముందు ఇసుక, మద్యం ఇవన్నీ ముందునుండీ అదనంగా చేస్తున్న అవినీతి అనీ దీనిని ప్రజలందరు గమనించాలనీ ఇలాంటి అవినీతి ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికలలో ఓడించి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో ఎన్. చంద్రకిరణ్, వెంకటేశ్వరరావు, నగేష్, ప్రసాద్, ఆనంద్, నారాయణ, పండు తదితరులు పాల్గొన్నారు.