చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి రూరల్ మండలంలో భారీ చేరికలు

చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి రూరల్ మండలం, పేరూరు గ్రామ పంచాయితీకి చెందిన మురళి ఆహ్వానం మేరకు వారి జన్మదిన వేడుకలలో పాల్గొనడం జరిగింది. మండల బీ.సి నాయకులు మురళి పి.ఆర్.పి పార్టీ నుండి ప్రజలకోసం తన గళాన్ని వినిపిస్తూ, ప్రజలకు సేవ చేయాలనే తాపత్రయంతో, జనసేన సభ్యత్వం నమోదు చేసుకొని ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి, జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ స్పూర్తితో, చంద్రగిరి నాయకులు దేవర మనోహర పోరాటపటిమ నచ్చి పేరూరు పంచాయతీలోని దాదాపు 30 కుటుంబాల ప్రతినిధులు మరియు దళిత నాయకులు విజయ్ ఆయన అనుచరవర్గం స్వఛ్చందంగా, మురళి తరపున దేవర మనోహర సమక్షంలో జనసేనపార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి పాల్గొన్నారు. అదేవిధంగా వీరమహిళ శ్రీమతి ఆశా, వాకా మురళి, యువరాజ్, శేఖర్, కుమార్, కిషోర్ మరియు స్థానిక జనసైనికులు పాల్గొనడం జరిగింది.