ఆకట్టకుంటున్న చావు కబురు చల్లగా పాట..

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠీ జంటగా నటించిన సినిమా చావు కబురు చల్లగా. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్‌, టీజర్, పాటలు అన్ని కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. అయితే సినిమాపై అంచనాలు మరింత అధికం చేసే విధంగా తాజాగా ఓ పాట విడుదల అయింది. బుల్లితెర బ్యూటీ అనసూయ ఈ పాటలో ఆడి పాడింది. ‘పుట్టినప్పుడేమో అమ్మకి పురిటి నొప్పివైతివీ..’ అంటూ సాగుతున్న ఈ పాటలో అనసూయ డాన్స్ ప్రత్యేకం. సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని ఈ పాట మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇదిలా ఉంటే ఈ సినిమా కౌశిక్ దర్శకత్వంలో బన్ని వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మార్చి19న విడుదల కానుంది.