గొట్లూరులో శ్రీ నిట్టూరు బాబు కుటుంబానికి చేయూత

అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ధర్మవరం నియోజవర్గం గొట్లూరులో మైనార్టీ వర్గానికి చెందిన కౌలు రైతు శ్రీ నిట్టూరు బాబు కుటుంబాన్ని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారు. బాబు వ్యవసాయంలో నష్టాలు రావడంతో అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బాబు మరణం తరువాత తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబానికి భరోసా కల్పించేందుకు జనసేన పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సాయాన్ని పవన్ కళ్యాణ్ ఆయన భార్య శ్రీమతి మల్లికకు అందజేశారు. ఈ సందర్భంగా కుమార్తెలు ఇద్దరిని పలకరించిన పవన్ కళ్యాణ్ గారు వారి చదువుల గురించి ఆరా తీశారు. ఆర్ధిక ఇబ్బందుల నేపథ్యంలో వారి చదువులకు ఎటువంటి ఆంటకం ఏర్పడకుండా జనసేన పార్టీ బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు.