జనసేనాని చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మామిడికుదురు జనసేన

రాష్ట్రంలోని ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఆర్దిక సహాయం చేస్తున్నారు. ఇంతటి మంచి కార్యక్రమం చేస్తోన్నఅధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారి చిత్రపటానికి మామిడికుదురు సెంటర్లో పాలాభిషేకంజరిగింది. జనసేన నాయకులు మండల అధ్యక్షుడు జాలెం శ్రీనివాస రాజా (జే.ఎస్.ఆర్) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అడబాల తాతకాపు ఉపాధ్యక్షుడు దొడ్డ జై రామ్ ఎంపీటీసీలు కొమ్ములు జంగమయ్య, వాసంశెట్టి రమణ, చెరుకూరి పార్వతి, సత్తిబాబు, కంకిపాటి నరసింహారావు, మత్తంశెట్టి బుజ్జి, తోరం యువరాజు, బొ౦తు చంద్రశేఖర్గారు, తెలగారెడ్డి యేసు, బల్ల సతీష్, వీధి సత్తిబాబు, కొమ్ముల భద్రం, కొమ్ముల రాము, కొమ్ముల శివసాయి, నిమ్మకాయల నాయుడు, తుల ఉమ, పినిశెట్టి శేఖర్, కాట్రేనిపాడు నాగేంద్ర, కంకిపాటి కోటేష్, రమణ౦ సాయి, అడబాల చిన్ని, నంబూరి అచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.