హిమాయత్ నగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చింతల

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో బిజెపి పార్టీ అధికారంలోకి రావడానికి జాతీయ, రాష్ట్ర నాయకత్వంతో పాటు, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా పరిధిలో ఉన్న ఖైరతాబాద్ నియోజకవర్గంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు, తెలంగాణ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి హిమాయత్ నగర్ లో ఖైరతాబాద్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి గెలుపు కొరకు ముఖ్య అతిథిగా హాజరవ్వడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమం భాద్యతలు నిర్వహిస్తున్నటువంటి బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున మాట్లాడుతూ కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి నేతృత్వంలో ఖైరతాబాద్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రచార కార్యక్రమం భాద్యతలు నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా మీద నమ్మకంతో ఉన్నత విద్యావంతుడుగా, బిజెపి పార్టీ యువ నాయకుడుగా నాకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా అమలు చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఖైరతాబాద్ నియోజక వర్గంలో బిజెపి పార్టీ గెలుపు అభివృద్ధికి మలుపు అవుతుంది అనే ఆశాభావం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో బిజెపి పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం. తొలి బిసి ముఖ్యమంత్రి ఎత్తుగడతో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రాథోడ్, హిమాయత్ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, ప్రసాద్, మాధవి, భార్గవి రెడ్డి, తులసి, ఇతర బిజెపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.