మత్స్యకారులకు అండగా నెల్లూరు జనసేన ర్యాలీ

నెల్లూరు, వైజాగ్ హార్బర్ అగ్ని ప్రమాద బాధిత మత్స్యకారులకు అండగా రూ50 వేల రూపాయల విరాళం నెల్లూరు జనసేన పార్టీ నుంచి వైజాగ్ హర్బర్ లో అగ్నిప్రమాద బాధిత మత్స్యకారులకు అండగా పవన్ కళ్యాణ్ నిలబడ్డారు అంటూ నెల్లూరు సిటీ గాంధీ బొమ్మ సెంటర్ నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు జనసేన పార్టీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ప్రజలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర చేస్తూ అసెంబ్లీ ఎగ్గొట్టి ప్రతి ఒక్కరినీ కలిసిన జగన్ అధికారం సాధించిన తర్వాత మాత్రం ప్రజలకు కనుమరుగైపోయారు. వైజాగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం జరిగి మూడు రోజులు గడుస్తున్నా సీఎం వచ్చి తమని ఆదుకోవాలని భాదితులు ధర్నా చేసినా లెక్కచేయని వైనం. అదే తమ నాయకుల పెళ్లిళ్లకి, ఫంక్షన్లకు మాత్రం ఎంత దూరమైనా అటెండ్ అవుతున్నారు. మూడు రోజులు గడుస్తున్నా అగ్ని ప్రమాద బాధితులకు తక్షణ పరిహారం అందజేస్తే చర్యలేవి వైసిపీ ప్రభుత్వం తీసుకోలేదు. వైజాగ్ ప్రమాదం తెలుసుకోగానే మా జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ జనసైనికులకు సమాచారం అందించి వాళ్ళకి సహయం అందించాల్సిందిగా పిలుపునిచ్చారు. గంటల వ్యవధిలోనే ప్రత్యక్షంగా కలసి పవన్ కళ్యాణ్ కలిసి 60 కుటుంబాలకు తక్షణ సహాయం కింద 50 వేల రూపాయలు సొంత సంపాదన నుంచి ఇస్తున్నారని ప్రకటించారు. తర్వాత మేలుకున్న జగన్ ప్రభుత్వం తమ నాయకులను పంపారే కానీ వెళ్లి పరామర్శించ లేకపోయారు. పెద్ద సముద్రతీరం గల రాష్ట్రాలలో మనదీ ఒకటి. జగన్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి జెట్టీలు, హార్బర్లు పెట్టిస్తాం మత్స్యకారులని అభివృద్ధి పరుస్తామని మాటలకే పరిమితం అయింది కానీ ఎక్కడ కూడా వాటి నిర్మాణానికి నోచుకోలేదు. పొరుగు రాష్ట్రాలైన కేరళ గుజరాత్ ప్రాంతంలో ప్రతి 30 కిలో మీటర్లకు జట్టి హార్బర్లు ఏర్పాటు చేయటం వలన మత్స్యకారులు అభివృద్ధి బాటలో ఉన్నారు. ఎక్కడ మాత్రం రాష్ట్రంలోని చెరువులు, రిజర్వాయర్లు, మత్స్యకార సొసైటీలకు కాకుండా బహిరంగ వేలం వేసేలా జీవో 271 తెచ్చి మత్స్యకారులు పొట్టగొడుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫిష్ ఆంద్ర ఏమైంది. ఆక్వా రైతులకు విద్యుత్ కు, వేట బోట్ల డీజిల్ సబ్సిడీలు ఎక్కడ. నష్టపోయిన మత్స్యకారులకు బోటు కు కనీసం 50 లక్షలు ఇవ్వాల్సి ఉండగా దీపావళి ఆఫర్ 20% ప్రకటించారు. ఋషికొండపై క్యాంపు కల్యాణ కార్యాలయానికి 433 కోట్లు ప్రజాధనాన్ని విలాసాలకు ఖర్చుపెట్టిన మీరు నష్టపోయిన మత్స్యకారుల జీవనోపాధికి మాత్రం ఈ ఆఫర్ లు ఎందుకు. అనంతపురంలోని మత్స్యకార సహకార సంఘాలు ఎన్నికలు జరపకుండా ఏకంగా ఎన్నికలే రద్దు చేశారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల మత్స్యకారుల జీవితాల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు కానీ మత్స్యకారు సామాజిక వర్గం నుంచి మంత్రి సిదిరి అప్పల్రాజు మాత్రం బాగుపడ్డారు. ఈ వైఎస్ఆర్సిపి గడిచిన నాలుగున్నర సంవత్సరాలలో మత్స్యకారులు ఏ విధంగా ఆడుకున్న ఆదుకున్నది లేదు. మత్స్యకారులు అభివృద్ది సాదించగలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ సమావేశాలలో మత్స్యకార సమస్యల సాధన, జీవన ప్రమాణాల మెరుగు పరచి అండగా నిలబడతామని పలు మార్లు తెలిపారు. జనసేన పార్టీ నెల్లూరు జిల్లా తరఫున కూడా బాధితులకు మా వంతు సహాయంగా నిలుస్తాం. జనసేన పార్టీ సిటీకి నిర్దేసుకునిగా నియమించబడిన వేములపాటి అజయ్ కి శుభాకాంక్షలు. ఆయన ఆధ్వర్యంలో నెల్లూరు సిటీలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఏటూరి రవి,జనసేన నాయకులు గుడి హరిరెడ్డి ,ప్రశాంత్ గౌడ్, కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షుడు సుధా మాధవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సందీప్, కావలి ఇన్చార్జి శ్రీధర్, వీర మహిళ నాగరత్నం, రేణుక, కొప్పోలు లక్ష్మి, బన్నీ, వర, అమీన్, ఖలీల్, హేమచంద్ర యాదవ్, మౌనిష్, కేశవ, వర్షన్, బాలు, సాయి కాశిఫ్, షారు తదితరులు పాల్గొన్నారు.