చిరంజీవి యువత మరియు జనసైనికుల ఆధ్వర్యంలో పేద ముస్లిం ఇంటికి చేయూత

తాడిపత్రిలోని స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో నిరుపేద కుటుంబానికి రెండు నెలలు సరిపడు సరుకులు మరియు 50 కేజీల బియ్యం 1500/- మందు ఖర్చులకు మరియు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడిపత్రి చిరంజీవి యువత అధ్యక్షులు ప్రసాద్, తాడిపత్రి జనసేన పట్టణ అధ్యక్షులు కే.యన్.చారి మరియు ప్రతాప్, ఏటీపీ జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యులు అల్తాఫ్ తాడిపత్రి జనసేన పట్టణ కమిటీ బుక్కపట్నం ఇమామ్ వలి, షేక్ రబ్బానీ జె.ఎస్.పి, శివకుమార్ షైక్ సాధక్ జాఫర్ సాధక్ తదితరులు పాల్గొన్నారు.