జనసేన ఆధ్వర్యంలో సెమీ క్రిస్టమస్ వేడుకలు

విజయవాడ, అజిత్ సింగ్ నగర్ స్థానిక 58వ డివిజన్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్టమస్ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జనసేన నగర అధ్యక్షులు పోతిన మహేష్ ముఖ్య అతిధిగా పాల్గొని కేక్ కటింగ్ నిర్వహించి క్రైస్తవ సోదరులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు. పాస్టర్ ప్రభుదాస్ క్రిస్టమస్ సందేశాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో చర్చి సండే స్కూల్ చిన్నారులు ఆలపించిన గీతాలు, నాటికలు అందరిని అలరిం చాయి. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, సెంట్రల్ నాయకులు బొలిశెట్టి వంశీ, నగర ఉపాధ్యక్షులు కామేళ్ల సోమనాధం, కె నరేంద్ర, అధ్యక్షులు ఎస్. కె.రెహమాన్, చలమశెట్టి ఉమా మహేశ్వరరావు, ఉదయ్ పాండే, సుమిత్ర, హర్షవర్ధన్ తదితరులు పాల్గొనడం జరిగింది. శుక్రవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్లో జరిగిన సెమీక్రిస్మస్ వేడుకలకు పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాయపాటి అరుణ, విజయవాడ సెంట్రల్ నాయకులు బొలిశెట్టి వంశీ, ఉపాధ్యక్షులు కామల్ల సోమనాథం, వెన్న శివశంకర్, ప్రధాన కార్యదర్శి నగేష్, నగర అధికార ప్రతినిధి అబ్దుల్ నజీబ్, అలియా బేగం మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు మరియు డివిజన్ అధ్యక్షులు, వీర మహిళlu, జనసైనికులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా మా 58వ డివిజన్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.