చీకట్లో చిరుదివ్వె….!

ఆంధ్రా దుస్థితికి అద్దం పట్టే ఘటన ఇది. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ఇందుకు వేదికైంది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన ముగించుకొని శుక్రవారం రాత్రి ఇక్కడకు చేరుకున్నారు. విలేకరులతో ఇష్టాగోష్టి జరుగుతుండగా విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. వెంటనే అక్కడున్న వారంతా సెల్ ఫోన్లకు పని చెప్పారు. మొబైల్ లైట్ల వెలుగులో కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కష్టాలను కళ్లకు కట్టాయి. ‘ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇదీ….అంధకార ఆంధ్రప్రదేశ్ ’ అంటూ వ్యాఖ్యానించారు. జనరేటర్ల సాయంతో కొద్ది సేపటికి లైట్లు వెలిగాయి. 20 నిమిషాల తరువాత కరెంటు వచ్చింది.