మూతపడిన బల్లిపర్రు రైతు భరోసా కేంద్రం

  • రైతు భరోసా కేంద్రాల డొల్లతనం బయటపడింది.. ఎస్.వి.బాబు

పెడన: సార్వా పంట కోతలు మొదలయ్యాయి.. ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడుతుంటే రైతులు ఆందోళనలో ఉన్నారు. రైతు భరోసా ఉద్యోగులు మాత్రం తాళాలు వేసి, ఇంటిదగ్గర హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారని పెడన నియోజకవర్గం జనసేన నాయకులు ఎస్.వి.బాబు ప్రభుత్వం పై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందుకే జనసేన చెప్పేది అవి రైతు భరోసా కేంద్రాలు కాదు.. రైతు టోకరా కేంద్రాలు అని. ఒకపక్క దాళ్వా లేదు.. మరోపక్క సార్వ ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు లేవు. రైతులకు న్యాయం జరగాలన్నా, రైతుల కష్టాలు పోవాలన్నా పవన్ అన్న అధికారంలోకి రావాల్సిందేనని నాయకులు ఎస్.వి.బాబు తెలియజేసారు.