నిరాశ్రిత పిల్లలకు పాదరక్షలు అందించిన కదిరి జనసేన నాయకులు

ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న అనే మాటను నిండుగా నమ్మే ఉద్యమమే జనసేన మాధవ గురుకులంలో ఉన్న నిరాశ్రిత పిల్లలకు పాదరక్షలు లేవని.. మాధవ గురుకులం నిర్వాహకులు కదిరి జనసేన పార్టీ దృష్టికి తీసుకొని రావడంతో వెంటనే స్పందించి జనసైనికుల సహకారంతో కదిరి జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు పొరకల రాజేంద్ర ప్రసాద్ మరియు లక్ష్మణ కుటాల ఆ పిల్లలకు పాదరక్షలను అందించడం జరిగింది.