బైక్ యాక్సిడెంట్ కు గురైన వెంకటరమణయ్యని పరామర్శించిన జనసేన నాయకులు

ఆత్మకూరు: సంగం మండలలోని సిద్దిపురం పంచాయతీ పరిధిలోని అనసూయ నగర్ కి చెందిన పత్తిపాటి వెంకటరమణయ్య కి గురువారం వెంగారెడ్డి పాలెం సమీపంలో బైక్ యాక్సిడెంట్ కావడం జరిగింది. బైక్ యాక్సిడెంట్ లో వెంకటరమణయ్యకి కుడి కాలు తీవ్రంగా గాయపడినది. విషయం తెలుసుకొన్న జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు దాడి భాను కిరణ్, సంగం మండల నాయకులు ఆకులేటి సాయిచంద్ శుక్రవారం మెడికవర్ హాస్పిటల్ కి వెళ్ళి.. గాయపడిన పత్తిపాటి వెంకటరమణయ్య ని పండ్లు ఇచ్చి పరామర్శించడం జరిగింది.