నేడు ప్రధానితో సీఎం జగన్‌ సమావేశం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు ఉదయం సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 6 గంటలకు ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, లోక్‌సభలో పార్టీ విప్‌ మార్గాని భరత్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు ఢిల్లీ వచ్చారు.  మంగళవారం ఉదయం 10.40 గంటలకు ప్రధాన మంత్రి అధికారిక నివాసంలో జరిగే సమావేశంలో రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర విభజన హామీలు, తదితర అంశాలపై ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి నివేదించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.