నేడు గజ్వేల్ నియోజకవర్గంలో సిఎం కేసీఆర్ పర్యటన
సీఎం కేసీఆర్ ఇవాళ గజ్వెల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి కాలువకు గోదావరి నీటిని సీఎం కేసీఆర్ రిలీజ్ చేయనున్నారు. అయితే.. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం టూర్కు సంబంధించిన పనులను పార్టీకి చెందిన ముఖ్య నేతలు పర్యవేక్షించారు. ఉదయం 10.30 కు వర్గల్ మండలం హౌసుల పల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుండి హల్దీ వాగులోకి గోదావరి జలాల విడుదల చేయనున్నారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత 11.15 కు మర్కుక్ మండలం పాముల పర్తి గ్రామంలో గోదావరి జలాలను గజ్వేల్ కాలువలోకి విడుదల చేయనున్నారు. దీంతో 10 రోజుల్లో హల్దీ, మంజీర నుండి నిజాం సాగర్ లోకి గోదావరి జలాలు రానున్నాయి. అలాగే గోదావరి జలాల విడుదలతో 32 చెక్ డ్యాంలు, 0.62 టీఎంసిల నీరు నిల్వ కానుంది.