జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి భారీగా తరలిరండి: ఎమ్మిగనూరు జనసేన

ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ రేఖ గౌడ్ ఆదేశాల మేరకు స్థానిక పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాష్ట్ర చేనేత వికాస రాష్ట్ర కార్యదర్శి కాస రవి ప్రకాష్, వెంకటేష్ లు మాట్లాడుతూ.. ఈనెల 14 న గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, ఇప్పటంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంకు ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొని సభను విజయవంతం చేసి రాబోయే ఎన్నికలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్, వినయ్, రాజు, ఎల్లప్ప, తదితరులు పాల్గొన్నారు.