జనసేన పార్టీ ఆవిర్భావ సభ విజయవతం కావాలి: మోటూరి

మార్చి 14 వ తారీకున అమరావతి లో జరగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభ విజయవంతం కావాలని పవన్ కళ్యాణ్ సేవాట్రస్ట్ వ్యవస్థాపకులు మోటూరి వెంకటేశ్వర రావు, ఆయన సతీమణి, చిందడ గరువు జనసేన ఎంపీటీసి మోటూరి కనక దుర్గ ఆలయంలో పూజలు చేసారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్వహించే బహిరంగ సభ ను విజయవంతం చేయాలని.. అలాగే సభకు వచ్చిన జనసైనికులు వారి వారి ఇళ్లకు క్షేమంగా చేరాలని.. ఏ విధమైన అడ్డంకులు లేకుండా సభ విజయవంతం అవ్వాలని వేంకటేశ్వర స్వామి వారికి అరటిగెల, కొబ్బరికాయలు నైవేద్యం సమర్పించి మీ ఆశీస్సులు మాకు కలగాలని వెంకటేశ్వర స్వామి ని ప్రార్థించారు.