ముస్లిం సోదరులకు తేనీటి విందు

కోనసీమ జిల్లా, రంజాన్ సందర్భంగా అమలాపురం పట్టణంలో ముమ్మిడివరం గేట్ దగ్గర ఉన్న మసీదు మరియు కుంకాలకొట్లు సంధి దగ్గర ఉన్న మసీదులో జనసేన నాయకులు తేనీటి విందు ఏర్పాటు చేసారు. అమలాపురంరూరల్ చిందాడగరువు జనసేన పార్టీ ఎంపీటీసి మోటూరి కనకదుర్గ, పవన్ కళ్యాణ్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు మోటూరి వెంకటేశ్వరరావు దంపతులు ధన సహాయంతో జనసేన పార్టీ గుర్తు గల గాజు గ్లాసులలో 250 మంది ముస్లిం సోదరులకు తేనీటి విందు ఏర్పాటు చేశారు.